ముంబయి: బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్ ఖరీదైన డూప్లెక్స్ ఫ్లాట్ కొన్నారు. ముంబయిలోని వర్లీలో ఉన్న ఈ ఫ్లాట్ ఖరీదు రూ.55.60 కోట్లని బాలీవుడ్ వర్గాల సమాచారం. షాహిద్ ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం రూ.2.19 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
షాహిద్ కొన్న ఈ కొత్త ఫ్లాట్ అపార్ట్మెంట్లోని 42వ అంతస్తులో ఉన్నట్లు తెలిసింది. 8,625 చదరపు అడుగులు ఉందట. అంతేకాదు ఆరు కార్లను పార్కింగ్ చేసుకునే సౌకర్యం కూడా ఉందని చెబుతున్నారు. ఈ ఫ్లాట్ను షాహిద్ పంకజ్ కపూర్, మీరా పేర్లతో రిజిస్టర్ చేయించారట.
షాహిద్ ప్రస్తుతం జుహు తారా రోడ్డులోని ప్రణీత భవనంలో ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో ఈ మధ్య వ్యభిచార కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయన్న కారణంతో వీరు ఇల్లు మారబోతున్నట్లు సమాచారం. షాహిద్ ఫ్లాట్ కొన్న భవనంలోనే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి.
www.eenadu.net/03324923BRKSHAHID1.JPG